డిండి ప్రభుత్వ ఐటీఐలో వివిధ కోర్సుల్లో సీట్ల భర్తీకి ‘రెండవ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్’
డిండి | 05-08-2026
డిండి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్ల భర్తీ కోసం రెండవ విడత వాక్-ఇన్ అడ్మిషన్స్ నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థులు https://iti.telangana.gov.in వెబ్సైట్ ద్వారా 2026 ఆగస్టు 5వ తేదీ ఉదయం 11 గంటల నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు.
ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమకు నచ్చిన ట్రేడ్లు, ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఐటీఐలను ఎంపిక చేసుకునేందుకు ఆగస్టు 5 నుంచి ఆగస్టు 15, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 11 గంటల వరకు నిర్వహించే “వాక్-ఇన్ అడ్మిషన్స్” కౌన్సెలింగ్లో పాల్గొనాలని సూచించారు.
అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాల కోసం తెలంగాణ ఐటీఐ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని ఐటీఐ ప్రిన్సిపాల్ కోరారు.
– AYUSH24 NEWS
“ప్రజల గొంతుక – నిజమైన వార్తల వేదిక”



