Breaking News
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నలకు శుభాకాంక్షలుచేనేత కార్మికుల సేవలు

అమూల్యం: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిహైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలోని చేనేత కార్మికులు, నేతన్నలు, చేనేత కళాకారులకు తెలంగాణ శాసనమండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత రంగం ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. చేనేత వస్త్రాలు మన దేశ కళాత్మక నైపుణ్యానికి అద్దం పడతాయని పేర్కొన్నారు.తరతరాలుగా తమ నైపుణ్యంతో చేనేత కళను సజీవంగా కొనసాగిస్తున్న నేతన్నల సేవలు ఎంతో అమూల్యమైనవని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.చేనేత రంగం అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన తెలిపారు.చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.— AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *