Breaking News
వీధి కుక్కల నియంత్రణపై అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల ఆందోళన

చిన్నారి గొంతును తీవ్రంగా కొరికిన వీధి కుక్క.. కుక్క కాటుకు ఇంకెంతమంది బలికావాలి?

దేవరకొండ | AYUSH24 NEWS:దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ చిన్నారిపై వీధి కుక్క దాడి చేసి గొంతు భాగంలో తీవ్రంగా కరిచిన ఘటన పట్టణంలో కలకలం రేపింది.ఇంతటి ఘటన జరిగినప్పటికీ సంబంధిత అధికారుల్లో మాత్రం స్పందన కనిపించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. సమస్య తమ దృష్టికి రాలేదన్నట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారని స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలో వీధి కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నా వాటి నియంత్రణకు సమర్థవంతమైన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పలువురు చిన్నారులు, వృద్ధులు, ప్రజలు కుక్కల దాడులకు గురైనప్పటికీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంపై అధికారులను ప్రశ్నిస్తున్నారు.కుక్క కాటుకు ఇంకెంతమంది ఇబ్బంది పడాలి?చిన్నారులు, వృద్ధులు కుక్కల దాడికి గురైన తర్వాతే అధికారులు స్పందిస్తారా? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత కాకుండా ముందుగానే వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.దేవరకొండ పట్టణంలో వీధి కుక్కల నియంత్రణకు మున్సిపల్ అధికారులు తక్షణమే ప్రత్యేక చర్యలు చేపట్టి, ప్రజలకు రక్షణ కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *