Breaking News
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు ఘన నివాళులు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

హైదరాబాద్ | AYUSH24 NEWS

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ సమాజానికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రమావత్ రవీంద్ర కుమార్ కూడా పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఆచార్య జయశంకర్ ఆశయాలను అనుసరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.

— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *