Breaking News
స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభం

న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి – సీనియర్ సివిల్ జడ్జి కె. అనిత

దేవరకొండ | AYUSH24 NEWS

2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గురువారం గౌరవ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిత్యం కేసుల విచారణలు, న్యాయపరమైన బాధ్యతలతో బిజీగా ఉండే న్యాయవాదులు, కోర్టు సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందుతారని తెలిపారు. విధి నిర్వహణతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని సూచించారు.

క్రీడల కార్యదర్శి కేతావత్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి.ఎస్. హరీష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నాయిల ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శి వనం జగదీశ్వర్, సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, గట్టు ఇంద్రవర ప్రసాద్, మల్‌రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. షోకత్ అలీ, మాడం రాములు, వసుకుల శ్రీనివాసులు, మహమ్మద్ ముస్తాక్, రియాజుద్దీన్, ఈడెం రవికుమార్, శ్రీకాంత్, పుష్పలత, బోలె సాయి శ్రీకాంత్, గణేష్ కోటితో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

— AYUSH24 NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *