Breaking News
నల్గొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ రభస

తన వార్డులో సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారంటూ ఆర్డీవోకు 5వ వార్డు కౌన్సిలర్ శ్రీకన్య ఫిర్యాదు

దేవరకొండ, నల్గొండ జిల్లా:దేవరకొండ మున్సిపాలిటీలో ప్రోటోకాల్ వ్యవహారం వివాదానికి దారితీసింది. తన 5వ వార్డులో తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించారని ఆరోపిస్తూ 5వ వార్డు కౌన్సిలర్ శ్రీకన్య స్థానిక ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.తన వార్డుకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజాప్రతినిధులకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందని కౌన్సిలర్ పేర్కొన్నట్లు తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా కార్యక్రమం నిర్వహించడం ప్రోటోకాల్‌కు విరుద్ధమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన పూర్తి వివరాలు, అధికారుల స్పందన వెలువడాల్సి ఉంది.

— AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

దేవరకొండ చేనేత సహకార సంఘంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

చేనేత కార్మికులకు ఘన సన్మానం – కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు

దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి రూ.25 వేల ఆర్థిక సహాయం ప్రకటించిన పద్మశాలి కులబాంధవులు

దేవరకొండ | AYUSH24 NEWS

జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవరకొండ పట్టణంలోని చేనేత సహకార సంఘం భవనంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమాన్ని కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి చేనేత సహకార సంఘం చైర్మన్ చేరిపల్లి బాలరాజు అధ్యక్షత వహించగా, దేవరకొండ మున్సిపల్ చైర్‌పర్సన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చేనేత రంగం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ కొత్త అవకాశాల వైపు అడుగులు వేస్తోందన్నారు. నేటి పరిస్థితుల్లో చేనేత వృత్తికి సాంకేతికతను జోడించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. భవిష్యత్ తరాలకు చేనేత వృత్తిని చేరువ చేయాలని, ప్రతి సభ్యుడు చేనేత సహకార సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ప్రభుత్వం చేనేత వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న కార్మికులకు రాయితీ రుణాలు, ప్రోత్సాహక పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడాలని కోరారు.

ఈ సందర్భంగా పట్టణానికి చెందిన నలుగురు చేనేత కార్మికులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం ఇటీవల అనారోగ్యంతో ఇంటికే పరిమితమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి పట్టణ పద్మశాలి కులబాంధవులు, మహిళలు కలిసి రూ.25 వేల ఆర్థిక సహాయం సేకరించి త్వరలో పూర్తి మొత్తాన్ని అందజేయనున్నట్లు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ పున్న వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం డైరెక్టర్లు గుర్రం విజయలక్ష్మి, రాపోలు భారతమ్మ, వనం శ్రీనివాసులు, చిలువేరు స్వామి నందీశ్వర్, పగిడిమర్రి శ్రీనివాసులు, ముసిని అంజన్, కౌన్సిలర్లు పులిజాల భవాని జానీ, గాజుల సావిత్రి మురళి, చిలువేరు చంద్రమౌళి, సిరిపోతు శ్రీరాములు, మసన మణిదీప్, గాజుల జనార్ధన్, వనం పుష్పలత, పగిడిమర్రి సత్యమూర్తి, ఇడం చంద్రమౌళి, పున్న భిక్షమయ్య, చేరిపల్లి జయలక్ష్మి, సంగిశెట్టి జ్యోత్స్నా తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

ఒంటి కాలుతో విద్యాభ్యాసం… కృత్రిమ కాలు కోసం ఎదురుచూపులు

కమలాపూర్ విద్యార్థిని పల్లపు ఆకాంక్ష హృదయవిదారక జీవన పోరాటం

దేవరకొండ | AYUSH24 NEWS

“అంగవైకల్యం శరీరానికే… ఆత్మవిశ్వాసానికి కాదు” అనే మాటను నిజం చేస్తూ, ఒంటి కాలుతో తన చదువును కొనసాగిస్తూ జీవితంలో ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేస్తోంది దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన పల్లపు ఆకాంక్ష.

తొమ్మిది సంవత్సరాల వయస్సులో బోన్ క్యాన్సర్ బారిన పడిన ఆకాంక్షకు ఎడమ కాలును తొలగించాల్సి వచ్చింది. అప్పటి నుంచి కర్ర సాయంతోనే నడుస్తూ ఎన్నో కష్టాలను అధిగమిస్తూ విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తోంది.

పేద కుటుంబానికి చెందిన ముగ్గురు కుమార్తెల్లో ఆకాంక్ష రెండవ సంతానం. ప్రస్తుతం హైదరాబాద్‌లో డిగ్రీ రెండో సంవత్సరం (బి.కాం) చదువుతోంది. చదువులో ముందుకు వెళ్లి భవిష్యత్తులో బ్యాంకు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా నిలవాలనే గొప్ప లక్ష్యంతో కృషి చేస్తోంది.

అయితే ప్రతి రోజు కళాశాలకు వెళ్లడం, ప్రయాణాలు చేయడం, సాధారణ పనులు కూడా కర్ర సాయంతోనే చేయాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తనకు ఒక కృత్రిమ ఎడమ కాలు ఏర్పాటు చేసి సహాయం చేయాలని దాతలు, స్వచ్ఛంద సంస్థలు, సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలను ఆకాంక్ష హృదయపూర్వకంగా వేడుకుంటోంది.

“నాకు ఒక కృత్రిమ కాలు లభిస్తే… నేను మరింత ఆత్మవిశ్వాసంతో చదువు పూర్తి చేసి, ఉద్యోగం సాధించి, నా కుటుంబానికి అండగా నిలుస్తాను” అని ఆకాంక్ష ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ యువతి జీవితంలో వెలుగు నింపేందుకు దాతృత్వ హృదయం కలిగిన వారు ముందుకు వచ్చి ఆమె ఆకాంక్షను నిజం చేయాలని AYUSH24 NEWS విజ్ఞప్తి చేస్తోంది.

– AYUSH24 NEWS

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన స్వర్ణకార సంఘం

దేవరకొండ | AYUSH24 NEWS

దేవరకొండ పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వర్ణకార సంఘం భవనం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి వేడుకలను సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి తీరనిదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS

నేరేడుగొమ్ము గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల అభివృద్ధికి రూ.88.35 లక్షలతో శంకుస్థాపన

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది – ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నేరేడుగొమ్ము | AYUSH24 NEWS

నేరేడుగొమ్ము మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.88.35 లక్షల వ్యయంతో చేపట్టనున్న కాంపౌండ్ వాల్, ప్రత్యేక మరమ్మత్తులు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణ పనులకు దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ సంబంధిత అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గిరిజన విద్యార్థినులు మెరుగైన విద్యతో పాటు అన్ని వసతులతో విద్యాభ్యాసం కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. నేరేడుగొమ్ము గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలకు మరిన్ని నిధులు మంజూరు చేయించి అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థకు నూతన ఊపు వచ్చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన, కొత్త భవనాల నిర్మాణం, మరమ్మత్తులు, పరిశుభ్రత, భద్రత వంటి అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మెస్ చార్జీలు, కాస్మోటిక్ చార్జీలను పెంచి, విద్యార్థులకు మెరుగైన ఆహారం, అవసరమైన వస్తువులు అందేలా చర్యలు తీసుకుందని తెలిపారు. ఈ చర్యలతో విద్యార్థుల ఆరోగ్యం, విద్యాభ్యాసంపై సానుకూల ప్రభావం పడుతోందన్నారు.

అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ విద్యను మరింత నాణ్యమైన స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయాలు అమలు చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోని నాణ్యమైన విద్య, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులకు ఉత్తమ భవిష్యత్తు అందించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకురావడానికి తాను కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, పాఠశాల సిబ్బందితో పాటు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, సోమాని నాయక్, పరిసర గ్రామాల సర్పంచులు కొప్పుల సురేందర్ రెడ్డి, హేమ్లా నాయక్, ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, ఇతర ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, రామావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

రూ.2 కోట్లతో నేరేడుగొమ్ము – కలకొండ తండా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత – ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

నేరేడుగొమ్ము | AYUSH24 NEWS

దేవరకొండ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ అన్నారు.

నేరేడుగొమ్ము నుంచి కలకొండ తండా వరకు గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు (బ్యాలెన్సింగ్ వర్క్) నిర్మాణ పనులకు సంబంధిత అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ఈ రోడ్డు పూర్తయితే నేరేడుగొమ్ము, కలకొండ తండా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన రవాణా అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

ముఖ్యంగా రైతులు తమ పంటలను పొలాల నుంచి మార్కెట్‌కు వేగంగా తరలించేందుకు ఈ రహదారి ఎంతో ఉపయోగపడుతుందని, రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు, గర్భిణీలు, వృద్ధులు, అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారు ఆసుపత్రులకు సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని చెప్పారు.

గిరిజన తండాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్య, వైద్యం, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రతి గ్రామం, ప్రతి తండా అభివృద్ధి చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. దేవరకొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, ప్రజలకు అవసరమైన ప్రతి మౌలిక వసతిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయిన అనంతరం తండా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించబడటంతో పాటు, ఆ ప్రాంత ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి తండాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ముక్కమల్ల వెంకటయ్య గౌడ్, గ్రామ సర్పంచ్ పులికంటి సుధాకర్, మాజీ జడ్పీటీసీ కేతావత్ బాలు నాయక్, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బైరెడ్డి కొండల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు యుగేందర్ రెడ్డి, గిరి యాదయ్య, గడ్డం వెంకటయ్య, పరిసర గ్రామాల సర్పంచులు కొప్పుల సురేందర్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ ఎలిజర్ల శ్రీను, వార్డు సభ్యులు, రామావత్ మోహన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, యువకులు, తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌కు ఘన నివాళులు

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

హైదరాబాద్ | AYUSH24 NEWS

తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య శ్రీ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన చూపిన ఆశయాలు, సిద్ధాంతాలు తెలంగాణ సమాజానికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ ఇన్‌చార్జి రమావత్ రవీంద్ర కుమార్ కూడా పాల్గొని ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని భావితరాలకు చాటిచెప్పేందుకు ప్రతి ఒక్కరూ ఆచార్య జయశంకర్ ఆశయాలను అనుసరించాలని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.

— AYUSH24 NEWS

ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి

పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతోంది – బీఆర్ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ

విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శ

దేవరకొండ | AYUSH24 NEWS

రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ మరియు స్కాలర్‌షిప్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బీఆర్ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

గురువారం దేవరకొండ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్‌వీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధుల విడుదలలో తీవ్ర జాప్యం కారణంగా వేలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల విద్యార్థుల ఉన్నత విద్యకు ఆటంకం కలుగుతోందని, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

విద్యార్థుల చదువుకు ఎలాంటి అంతరాయం కలగకుండా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలన్నింటినీ తక్షణమే విడుదల చేసి వారి భవిష్యత్తును కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యను రాజకీయాలకు అతీతంగా పరిగణించి, విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్‌వీ నాయకులు బత్తుల ఆంజనేయులు, కొర్ర రాజేష్, అనిల్, వెంకటేష్, శ్రీను, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH24 NEWS

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు ప్రారంభం

న్యాయవాదులు, కోర్టు సిబ్బందికి క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయి – సీనియర్ సివిల్ జడ్జి కె. అనిత

దేవరకొండ | AYUSH24 NEWS

2026 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవరకొండ న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోసం నిర్వహిస్తున్న క్రీడా పోటీలను గురువారం గౌరవ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి కె. అనిత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నిత్యం కేసుల విచారణలు, న్యాయపరమైన బాధ్యతలతో బిజీగా ఉండే న్యాయవాదులు, కోర్టు సిబ్బంది క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యాన్ని కూడా పొందుతారని తెలిపారు. విధి నిర్వహణతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అవసరమని సూచించారు.

క్రీడల కార్యదర్శి కేతావత్ శంకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శ్రీ కె.వి.ఎస్. హరీష్ బాబు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సన్నాయిల ఉమామహేశ్వర్, ప్రధాన కార్యదర్శి వనం జగదీశ్వర్, సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, గట్టు ఇంద్రవర ప్రసాద్, మల్‌రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎం.డి. షోకత్ అలీ, మాడం రాములు, వసుకుల శ్రీనివాసులు, మహమ్మద్ ముస్తాక్, రియాజుద్దీన్, ఈడెం రవికుమార్, శ్రీకాంత్, పుష్పలత, బోలె సాయి శ్రీకాంత్, గణేష్ కోటితో పాటు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి.

— AYUSH24 NEWS

ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు

విజయ భవన్‌లో మహనీయుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్ | AYUSH24 NEWS

ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సైద్ధాంతిక బలాన్ని అందించి, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లాలాపేటలోని విజయ భవన్‌లో ఘనంగా నివాళులర్పించారు.

తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు, ఎం.డి. శ్రీ చంద్రశేఖర్ రెడ్డి, IAS గారితో కలిసి ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గుత్తా అమిత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పడంలో, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేయడంలో ఆచార్య జయశంకర్ గారి సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజల హక్కులు, అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప విద్యావేత్త, మేధావి, ఉద్యమకారుడైన ఆచార్య జయశంకర్ చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

— AYUSH24 NEWS