Breaking News
లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షల శిబిరం

దాత కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం ముదిగొండలో ఉచిత కంటి పరీక్షల శిబిరం

157 మందికి కంటి పరీక్షలు – 17 మందికి శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు తరలింపు

దేవరకొండ | AYUSH24 NEWS

ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకొని లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో, దాత కీర్తిశేషులు కాశిరెడ్డి రఘుమారెడ్డి జ్ఞాపకార్థం వారి మనుమడు కాశిరెడ్డి సాత్విక్ రెడ్డి, తండ్రి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి ఆర్థిక సహకారంతో గురువారం ముదిగొండ పాత గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.

ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ, గతించిన వారి జ్ఞాపకార్థంగా పేద ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి వైద్య శిబిరాల నిర్వహణకు ముందుకు వస్తున్న దాతలను అభినందించారు. గ్రామీణ ప్రాంత ప్రజలు కంటి సమస్యలతో ఇబ్బందులు పడకుండా తరచూ ఉచిత కంటి పరీక్షల శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ శిబిరంలో మొత్తం 157 మంది కంటి పరీక్షలు చేయించుకోగా, వారిలో 17 మందిని శస్త్రచికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు గుద్దేటి జంగయ్య, ప్రధాన కార్యదర్శి కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, కోశాధికారి చిలుకూరి కాశీనాథ్, జోన్ చైర్మన్ గాజుల ఉషారాణి, సభ్యులు గాజుల రాజేష్, వనం శ్రీనివాసులు, వస్కుల సత్యనారాయణ, నల్లగ సత్యనారాయణ, కుంచకూరి లక్ష్మణ్, దినేష్, ఆప్తమాలజిస్టు డా. హరి, కమలాపూర్, ముదిగొండ మాజీ సర్పంచులు రేపాని ఇద్దయ్య, వడ్డేపల్లి జైహింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *