Breaking News
ఆగస్టు 15లోపు కాంగ్రెస్ కమిటీలు పూర్తి చేయాలి.. లేకుంటే ‘మాజీ’ అనే పదం జోడించుకోవాల్సిందే: టీపీసీసీ

డీసీసీ అధ్యక్షులకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలక ఆదేశాలు – మండల, టౌన్, డివిజన్ కమిటీల ఏర్పాటుకు గడువు

AYUSH24 NEWS | హైదరాబాద్

ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండల, టౌన్, డివిజన్ కాంగ్రెస్ కమిటీలను ఆగస్టు 15లోపు తప్పనిసరిగా పూర్తి చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిర్ణయించిన గడువులోపు కమిటీలను పూర్తి చేయని పక్షంలో సంబంధిత పదవులకు “మాజీ” అనే పదం జోడించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆలస్యం చేయకుండా మండల, టౌన్, డివిజన్ స్థాయిలో పార్టీ అధ్యక్షులను వెంటనే ఎంపిక చేసి, కమిటీలను పూర్తి చేసి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయాలని సూచించారు.

పార్టీ బలోపేతంలో ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, సంస్థాగత నిర్మాణాన్ని గడువులోపు పూర్తి చేయడం అత్యంత కీలకమని టీపీసీసీ పేర్కొంది.

“ఆగస్టు 15 గడువు… కమిటీలు పూర్తి చేయండి… కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయండి!”

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *