TPCC ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వింజమూరి శేఖర్
పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు 👍తెలిపిన వింజమూరి శేఖర్
, నల్గొండ జిల్లా:తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా వింజమూరి శేఖర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యత పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, TPCC నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన TPCC ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర చైర్మన్, మానకొండూరు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, అలాగే దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్లకు వింజమూరి శేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.తనపై నమ్మకం ఉంచి రాష్ట్రస్థాయి బాధ్యతను అప్పగించడం ఎంతో గౌరవంగా, అదే సమయంలో మరింత బాధ్యతగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. పార్టీ నాయకత్వం తనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేలా అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో పాటు భారత రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలకు కట్టుబడి పనిచేస్తానని ఆయన అన్నారు. ఎస్సీ వర్గాల హక్కులు, సంక్షేమం, అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ డిపార్ట్మెంట్ను మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యకర్తలను సమన్వయం చేయడం, ఎస్సీ వర్గాల సమస్యలను పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాటి పరిష్కారం కోసం ప్రజల తరఫున నిబద్ధతతో పనిచేయడం తన ప్రధాన లక్ష్యాలని వింజమూరి శేఖర్ తెలిపారు.తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులందరికీ ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతం కోసం, ఎస్సీ వర్గాల అభ్యున్నతి కోసం, సామాజిక న్యాయం కోసం మరింత బాధ్యతతో, నిబద్ధతతో పనిచేస్తానని వింజమూరి శేఖర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
— AYUSH24 NEWS
The Voice of Truth

