కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రేపని అంజయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రేపని అంజయ్య ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే శ్రీ నేనావత్ బాలు నాయక్ బుధవారం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేపని అంజయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, అవసరమైన అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
రేపని అంజయ్య పార్టీ అభివృద్ధి కోసం విశేష సేవలందించారని, ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ ఎం.ఏ. సిరాజ్ ఖాన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మారుపాకుల సురేష్ గౌడ్, మాజీ మండల అధ్యక్షులు లోకసాని శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకుడు మునుకుంట్ల వెంకట్ రెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొర్ర రాంసింగ్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, సీనియర్ నాయకుడు వైఎస్ కర్ణాకర్, సర్పంచులు నేనావత్ కవిత–లచ్చిరాం, నేనావత్ పాండు, రామావత్ బాబురామ్, జబ్బు అంజి యాదవ్, కోఠి, చరణ్, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth”

