Breaking News
కొండ భీమనపల్లిలో విషాదం.. మల్టీపర్పస్ వర్కర్ కుమారుడు మృతి

మృతుడి కుటుంబానికి గ్రామపంచాయతీ పాలకవర్గం రూ.10 వేల ఆర్థిక సహాయం

దేవరకొండ, ఆగస్టు 8 | AYUSH24 NEWS:కొండ భీమనపల్లి గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్‌గా పనిచేస్తున్న పండ్ల అంజమ్మ కుమారుడు పండ్ల విజయ్ (25) శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఇటీవల అనారోగ్యానికి గురైన విజయ్‌కు కుటుంబ సభ్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు తెలిపారు.మృతుడు విజయ్‌కు భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.విజయ్ మృతి విషయం తెలుసుకున్న కొండ భీమనపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గం తరఫున మృతుడి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండ్రెడ్డి శ్రీను, ఉప సర్పంచ్ కడారి వనజ సైదులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *