దేవరకొండలో ఘనంగా ప్రారంభమైన MG ఎలక్ట్రికల్ స్కూటీ షాప్ – మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026దేవరకొండ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన MG ఎలక్ట్రికల్ స్కూటీ షాప్ను దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షాప్ యజమానులు గండూరి లక్ష్మణ్, సాగర్లకు శుభాకాంక్షలు తెలియజేసి, వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజురోజుకు పెరుగుతోందన్నారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో ఎలక్ట్రిక్ స్కూటీలు ప్రజలకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా, వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.దేవరకొండలో ఇటువంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరమని, యువత స్వయం ఉపాధి దిశగా ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి, వ్యాపార రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పొట్ట మురళి, పొట్ట మధు, సర్పంచ్ ఆడారపు హరికృష్ణ, బొడ్డుపల్లి కృష్ణ, ఇలియాస్ పటేల్, మాడం రాములు, ముదిగొండ హరిదాస్, అఫ్రోజ్, అంజి, శ్రీనివాస్, షాప్ యజమానులు గండూరి లక్ష్మణ్, సాగర్, పార్టీ నాయకులు, యువకులు మరియు స్థానికులు పాల్గొన్నారు.– AYUSH24 NEWS


