ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన స్వర్ణకార సంఘం
దేవరకొండ | AYUSH24 NEWS
దేవరకొండ పట్టణంలోని స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో గురువారం స్వర్ణకార సంఘం భవనం వద్ద తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి వేడుకలను సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం అధ్యక్షులు సిరిగిద్దే విఠలాచార్య మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఆయన లేని లోటు తెలంగాణ సమాజానికి తీరనిదని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS

