యువతే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి వెన్నుముక: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి
ఘనంగా 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు
దామెర, ఆగస్టు 9:యువతే కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి వెన్నుముక అని, యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం దామెర మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి యువతకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన భారత జాతీయ యువజన కాంగ్రెస్, నేడు దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు. యువజన కాంగ్రెస్ అంటేనే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండే యువత అని కొనియాడారు.రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను యువత గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు చూపిన మార్గంలో, రాహుల్ గాంధీ ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
— అయుష్24 న్యూస్ | The Voice of Truth

