Breaking News
హైకోర్టు న్యాయవాది ఇనుముల సతీష్ కుటుంబాన్ని పరామర్శించిన గోటిగారి కిషన్‌జీ

AYUSH24 NEWS | మంథని

మంథని పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయవాది ఇనుముల సతీష్ గారి తల్లి గౌరమ్మ మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను గోటిగారి కిషన్‌జీ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ సందర్భంగా గౌరమ్మ గారి చిత్రపటానికి నివాళులర్పించిన గోటిగారి కిషన్‌జీ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం ఇనుముల సతీష్‌తో పాటు కుటుంబ సభ్యులను ఓదార్చి, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రఘోత్తం రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొని గౌరమ్మ గారికి ఘనంగా నివాళులర్పించారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *