Breaking News
ఆగస్టు 9న నల్లబెల్లికి కేసీఆర్‌ పర్యటన

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పరామర్శ

బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) ఆదివారం ఆగస్టు 9న నల్లబెల్లి గ్రామానికి వెళ్లి ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్‌ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలకాలని మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్ పిలుపునిచ్చారు.📍 స్వాగత స్థలం: ఆరెపల్లి – దామెర క్రాస్‌ రోడ్⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు🚗 ఇల్లందు నుంచి వచ్చే వాహనాలు ఉదయం 10 గంటలలోపు ఆరెపల్లి–దామెర క్రాస్‌ రోడ్‌కు చేరుకోవాలని సూచించారు.అక్కడి నుంచి కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికి, ఆయన వెంట నర్సంపేట మండలం నల్లబెల్లికి వెళ్లాలని కోరారు.కాగా, పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి కేసీఆర్‌ రూ.2.25 కోట్ల ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి.

📌 AYUSH24 NEWS – ది వాయిస్ ఆఫ్ ట్రూత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *