ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్కు ఘన స్వాగతం
కొండమల్లేపల్లి: ఈరోజు కొండమల్లేపల్లి పట్టణానికి విచ్చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి, కమిషన్ సభ్యులు నేనావత్ రాంబాబు నాయక్ గారికి కొండమల్లేపల్లి చౌరస్తాలో రామావత్ రమేష్ నాయక్ గారు, ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా అతిథులను శాలువాలతో సత్కరించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో నేనావత్ కృష్ణ, నేనావత్ మధు, ఆదిరాల రమేష్, మూడవత్ జగ్రూ నాయక్, శంకర్ నాయక్, సైదులు, కొర్ర కోటేష్, బాలు, బాలకృష్ణ, అందుగుల నాగరాజు, అందుగుల కేశవులు తదితరులు పాల్గొన్నారు.

— AYUSH 24 NEWS
The Voice of Truth

