Breaking News
ఢిల్లీలో జాతీయ కరాటే పోటీల్లో మంథని విద్యార్థుల సత్తా

జపాన్ షిటోరియో షికోకాయ్ కరాటేలో నాలుగు బంగారు పతకాలు

మంథని, ఆగస్టు 10 – AYUSH24 NEWS:ఢిల్లీలోని తాల్కటోరా ఇండోర్ స్టేడియంలో ఈ నెల 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే పోటీల్లో పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన జపాన్ షిటోరియో షికోకాయ్ కరాటే విద్యార్థులు ప్రతిభ కనబరిచి నాలుగు బంగారు పతకాలు సాధించారు.కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో పాల్గొన్న విద్యార్థులు కుమిటే విభాగంలో అద్భుత ప్రదర్శన చేసి విజేతలుగా నిలిచారు.🥇 బంగారు పతకాలు సాధించిన విద్యార్థులుఅండర్–17 క్యాడెట్, 76 కేజీల విభాగం: ఎం.డి. తహ హసీన్ తైబాఅండర్–14 మేల్, 12 సంవత్సరాలు, మైనస్ 30 కేజీల విభాగం: మారేడు గుండా రిషిఅండర్–14 మేల్, ప్లస్ 30 కేజీల విభాగం: ఎలావేనా నిషిత్అండర్–14 ఫిమేల్, ప్లస్ 35 కేజీల విభాగం: ఆదిమూలపు అభిజ్ఞ సిరిఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించడం పట్ల మంథని ప్రాంతానికి చెందిన కరాటే అభిమానులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.🏆 విజేతలకు అభినందనలుబంగారు పతకాలు సాధించిన విద్యార్థులను షికోకాయ్ కరాటే ఇంటర్నేషనల్ ఇండియా & KIO ప్రెసిడెంట్ పి. భరత్ శర్మ, తెలంగాణ రిప్రజెంటేటివ్ పాలకుర్తి పాపయ్య, కార్యనిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, తెలంగాణ స్పోర్ట్స్ కరాటే-డూ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మల్యాల రామస్వామి, సీనియర్ కరాటే శిక్షకులు చైతన్య, ఇన్‌స్ట్రక్టర్లు నాగలి రాకేష్, జడగల శివాని, కావేటి శివగణేష్ తదితరులు అభినందించారు.విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.

— AYUSH24 NEWS

The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *