Breaking News
తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గానికి ఘన సన్మానం

దేవరకొండ | AYUSH24 NEWS

తెలంగాణ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నూతన పాలకవర్గం అభినందన సభ మంగళవారం హైదరాబాద్‌ వనస్థలిపురంలోని కర్నాటి గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవరకొండ చేనేత సహకార సంఘం అధ్యక్షులు చేరిపల్లి బాలరాజు, ఉపాధ్యక్షులు చిలువేరు స్వామి నందీశ్వర్, ప్రధాన కార్యదర్శి పున్న గోవర్ధన్, కోశాధికారి వనం శ్రీనివాసులులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అనంతరం సహకార చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించి, నూతన పాలకవర్గ సభ్యులకు చట్టపరమైన అంశాలు, సంఘాల నిర్వహణపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వనం శాంతి కుమార్, రిటైర్డ్ ఆర్డీవో ఎం. వెంకటేశం హాజరై మాట్లాడుతూ, నూతన చేనేత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులు చేనేత రంగ అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అలాగే, ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ప్రత్యేకంగా తగిన నిధులు కేటాయించి, చేనేత కార్మికుల సంక్షేమానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ చేనేత సహకార సంఘం సభ్యులు పగిడిమర్రి శ్రీనివాస్తో పాటు పలువురు చేనేత కార్మికులు, సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *