పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు ఘన సన్మానం
AYUSH24 NEWS
ఇటీవల పదవీ విరమణ పొందిన విశ్రాంత ఉపాధ్యాయులు బిరుదు మధు, బోనాల రవీందర్లను పెంజెరుట్ట కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు లోకే మనోహర్, టేక్కేగారి రాధాకృష్ణన్ శాలువాలు కప్పి ఉపాధ్యాయులను సత్కరించి, వారి సేవలను కొనియాడారు.
విద్యారంగంలో ఎన్నో సంవత్సరాల పాటు సేవలందిస్తూ, వేలాది మంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఈ ఉపాధ్యాయుల సేవలు చిరస్మరణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో గొప్పదని, వారి సేవలు భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది కేతిరెడ్డి రఘోతం రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గోటికార్ కిషన్ జీ, మంథని రమేష్, రాంపల్లి లక్ష్మణ్, పల్లి మధుసూదన్ తదితరులు పాల్గొని పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
– AYUSH24 NEWS
“The Voice of Truth

