Breaking News
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సమావేశం & భారీ ర్యాలీ

ఇల్లందు, ఆగస్టు 9: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఆదివారం ప్రత్యేక సమావేశం, అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం 10:00 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువత, ప్రజలు, ఆదివాసీ సోదర–సోదరీమణులు పాల్గొననున్నారు.సమావేశం అనంతరం భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కావున టేకులపల్లి మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, యువత, ఆదివాసీ సోదర–సోదరీమణులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టేకులపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోరింది.📅 తేదీ: 09-08-2026⏰ సమయం: ఉదయం 10:00 గంటలకు📍 వేదిక: ఇల్లందు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం

— AYUSH24 న్యూస్

ది వాయిస్ ఆఫ్ ట్రూత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *