Breaking News
సెకండ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో కలీం మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థుల సత్తా

కటా, కుమిటే విభాగాల్లో అద్భుత ప్రతిభ – నేపాల్ గ్రాండ్ మాస్టర్ రంజిత్ సింగ్ చేతుల మీదుగా పతకాలు, మాస్టర్ షేక్ అలీమ్‌కు ట్రోఫీతో ఘన సత్కారం

📰 AYUSH24 NEWS ప్రత్యేక కథనంసెకండ్ ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో కలీం మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన మాస్టర్ షేక్ అలీమ్ మరియు ఆయన వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విశేష విజయాలను సాధించారు.ఈ పోటీల్లో కటా మరియు కుమిటే విభాగాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు ఉదయ్ కిరణ్, అక్బర్, జునీరా, సుదీప్, హిమశ్రీ, కీర్తి, భువిత్, రామ్ చరణ్ పతకాలను కైవసం చేసుకుని అకాడమీకి గౌరవాన్ని తీసుకొచ్చారు.ఈ ఛాంపియన్‌షిప్‌కు చీఫ్ ఆర్గనైజర్‌గా మధ్య కెనాన్ గౌడ్ వ్యవహరించగా, పలు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. విజేతలకు నేపాల్ గ్రాండ్ మాస్టర్ రంజిత్ సింగ్ చేతుల మీదుగా మెడల్స్, సర్టిఫికెట్లు అందజేయగా, మాస్టర్ షేక్ అలీమ్కు ట్రోఫీతో పాటు మాస్టర్ సర్టిఫికెట్‌ను అందించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ గురువు మాస్టర్ గోపన్న మరియు సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ లక్ష్మీ సామ్రాజ్యం ప్రత్యేక అతిథులుగా పాల్గొని విజేతలను అభినందించారు. వారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మార్షల్ ఆర్ట్స్ ద్వారా క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం మరియు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.ఈ విజయంతో కలీం మార్షల్ ఆర్ట్స్ అకాడమీ మరోసారి తన ప్రతిభను చాటుకొని, మార్షల్ ఆర్ట్స్ రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఈ సందర్భంగా విజేతలను పలువురు అభినందిస్తూ, భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *