ఆషాఢ మాసం గోరింటాకు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఆదిత్య కాలనీ మహిళలు
సాంప్రదాయాన్ని చాటిన మహిళలు.. ఎర్రటి గోరింటాకుతో ఆషాఢ వేడుకల్లో సందడి

ఆరోగ్యానికి చల్లదనం, సంస్కృతికి ప్రతీకగా గోరింటాకు.. ఆదిత్య కాలనీలో ప్రత్యేక వేడుకలు

దేవరకొండ, ఆగస్టు 2 (అయుష్ 24 న్యూస్): ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తున్న భారతీయ సాంప్రదాయంలో భాగంగా, దేవరకొండ పట్టణంలోని ఆదిత్య కాలనీ మహిళలు ఆదివారం ఘనంగా గోరింటాకు వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా మహిళలు ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ ఆనందోత్సాహాల మధ్య వేడుకల్లో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, వేసవికాలంలో శరీరంలో పెరిగిన వేడిని తగ్గించడంలో గోరింటాకు సహాయపడుతుందని, వర్షాకాలమైన ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం శాస్త్రీయంగానూ శరీరానికి చల్లదనాన్ని అందిస్తుందని తెలిపారు.సాంప్రదాయం, ఆరోగ్యం రెండింటికీ ప్రతీకగా నిలిచే ఈ ఆచారాన్ని ప్రతి మహిళ పాటించాలని వారు ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో ఆదిత్య కాలనీ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని, ఎర్రటి గోరింటాకుతో చేతులను అలంకరించుకొని సాంప్రదాయబద్ధంగా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.– AYUSH 24 NEWS

