బాధిత కుటుంబాలకు అండగా కాంగ్రెస్ నాయకులు – ఆర్థిక సహాయం అందించిన కోరం సురేందర్, ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఆర్సీ పేటలో ప్రమాద మృతుడి కుటుంబానికి రూ.10 వేలు.. హనుమతండాలో మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

AYUSH24 NEWS
జిల్లాలో వేర్వేరు గ్రామాల్లో విషాదంలో ఉన్న కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచారు.
ఆర్సీ పేట గ్రామానికి చెందిన ఈసం వెంకటేశ్వర్లు ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసం సువర్ణ, ఉపసర్పంచ్ ఈసం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.
అదే విధంగా కోయగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని హనుమతండా గ్రామానికి చెందిన గుగులోత్ శంకర్ అనారోగ్యంతో మృతి చెందగా, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, కోయగూడెం గ్రామ సర్పంచ్ కోరం సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
– AYUSH24 NEWS | The Voice of Truth

