Breaking News
బీసీ హక్కుల సాధన – సామాజిక న్యాయ పోరాట సభను విజయవంతం చేయాలి

దేవరకొండలో సన్నాహక సమావేశం.. భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపు

దేవరకొండ | AYUSH24 NEWS:బీసీ ఇంటెలెక్ట్యువల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆగస్టు 9, 2026 (ఆదివారం) నల్గొండ పట్టణంలోని చిల్లకాయనగర్‌లో గల జీఎల్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న **“బీసీ హక్కుల సాధన – సామాజిక న్యాయ పోరాట సభ”**ను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం దేవరకొండలో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. ఆగస్టు 9న నిర్వహించనున్న సభకు బీసీ సంఘాల నాయకులు, మేధావులు, యువత, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ మహాసభకు ఐఏఎస్ అధికారి టి. చిరంజీవులు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. బీసీల రాజ్యాంగ హక్కులు, సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత, విద్య, ఉపాధి అవకాశాలు తదితర కీలక అంశాలపై సభలో చర్చ జరగనున్నట్లు వెల్లడించారు.సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, బీసీ సమాజానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యతను చాటాలని నాయకులు కోరారు.ఈ సమావేశంలో దేవరకొండ నియోజకవర్గ BCIF ఇన్‌చార్జ్ బొమ్మ శ్రీనివాస్, బీసీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకుడు లింగంపల్లి మధు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు వనం బుచ్చయ్య, గుండెబోయిన శ్రీనివాస్, బొల్లంపల్లి మల్లేష్, ఎలిజాల శ్రీను, మస్నా శ్రీరామ్, సత్యనారాయణ, సైదులు, కిరణ్, సతీష్ తదితర వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.– AYUSH24 NEWSప్రజల గొంతుక – నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *