బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ
ఘనంగా సన్మానించిన ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం సభ్యులు
దేవరకొండ టౌన్, జూలై 31 (AYUSH24 NEWS):
దేవరకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాసులు పదవీ విరమణ చేసిన సందర్భంగా నిర్వహించిన సన్మాన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దేవరకొండ ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు తాడిశెట్టి నరసింహ, కార్యదర్శి అంకం చంద్రమౌళి, సహాధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, జిల్లా ఉపాధ్యక్షులు కంచర్ల నారాయణ రెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్తో పాటు సంఘ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ, ప్రధానోపాధ్యాయులుగా చేరిపల్లి శ్రీనివాసులు అందించిన సేవలు ఆదర్శప్రాయమని కొనియాడారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి, పాఠశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు.
పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవాన్ని ప్రభుత్వ పెన్షనర్స్ సంఘం అభివృద్ధికి వినియోగించాలని కోరుతూ, సంఘంలో చేరి సేవలు అందించాలని ఆహ్వానించారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది కూడా శ్రీనివాసులు సేవలను ప్రశంసిస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. పదవీ విరమణ అనంతర జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందంగా సాగాలని ఆకాంక్షించారు.
— AYUSH24 NEWS
“THE VOICE OF TRUTH”

