Breaking News
AYUSH24 NEWS కథనానికి స్పందన.. దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి అండగా నిలిచిన మల్లయ్య టీ స్టాల్ యజమాని గాజుల వంశీ

నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, నగదు అందజేత – దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి

AYUSH24 NEWS | దేవరకొండ | 03-08-2026

దేవరకొండ పట్టణంలోని సంజయ్ కాలనీకి చెందిన దువ్వ వెంకటేశ్వర్లు అనారోగ్యంతో గత రెండు నెలలుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటికి చేరుకున్నారు. ఆరోగ్య పరిస్థితి కారణంగా పనికి వెళ్లలేకపోవడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడంతో తమను ఆదుకోవాలని AYUSH24 NEWS ద్వారా వేడుకున్నారు.

దీనిపై ఆగస్టు 2న AYUSH24 NEWS ప్రచురించిన కథనానికి స్పందించిన దేవరకొండకు చెందిన ప్రముఖ మల్లయ్య టీ స్టాల్ యజమాన్యం మానవత్వాన్ని చాటుకుంది. సోమవారం మల్లయ్య టీ స్టాల్ ఆధ్వర్యంలో గాజుల వంశీ దువ్వ వెంకటేశ్వర్ల కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులతో పాటు కొంత నగదు సహాయాన్ని వారి నివాసంలో భార్య యాదమ్మకు అందజేశారు.

ఈ సందర్భంగా గాజుల వంశీ మాట్లాడుతూ, మానవత్వంతోనే ఈ సహాయం అందించామని, కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను తెలుసుకుని వెంటనే స్పందించినట్లు తెలిపారు. సమాజంలోని ఇతర దాతలు కూడా ముందుకు వచ్చి వెంకటేశ్వర్ల కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పగిడిమర్రి నాగరాజు, పగిడిమర్రి సతీష్, మసన మణిదీప్, జల్ల అంజి, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

AYUSH24 NEWSకు కృతజ్ఞతలు తెలిపిన దువ్వ వెంకటేశ్వర్లు

తన దయనీయ పరిస్థితిని ప్రజలకు చేరవేసి, సహాయం అందేలా కృషి చేసిన AYUSH24 NEWSకు దువ్వ వెంకటేశ్వర్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమలాంటి నిరుపేద కుటుంబాలకు మీడియా అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు.

– AYUSH24 NEWS | The Voice of Truth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *