Breaking News
చికిత్స కోసం రూ.2.50 లక్షల LOC అందజేత

అనారోగ్యంతో బాధపడుతున్న సాయి రాజ్‌కు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భరోసా

మంథని | AYUSH24 NEWS

తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చొరవతో మంథని నియోజకవర్గం, కాటారం మండలం, దేవరాంపల్లి గ్రామానికి చెందిన చీమల సాయి రాజ్ (తండ్రి: చీమల నర్సింహులు) వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా రూ.2,50,000 లెటర్ ఆఫ్ క్రెడిట్ (LOC) మంజూరు చేశారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయి రాజ్‌కు వైద్య ఖర్చుల కోసం సహాయం అవసరమని మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన మంత్రి CMRF ద్వారా రూ.2.50 లక్షల LOC మంజూరు చేయించి, హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన ఆసుపత్రి సహాయకుల ద్వారా సంబంధిత పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించి తమ కుటుంబానికి అండగా నిలిచిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు సాయి రాజ్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

“దుద్దిళ్ల హస్తం – పేదల నేస్తం” అంటూ స్థానికులు మంత్రి సేవలను అభినందించారు.

– AYUSH24 NEWS
“The Voice of Truth”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *