Breaking News
మెగా డెయిరీ అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష

హైదరాబాద్‌ రావిరాలలోని మెగా డెయిరీలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ గుత్తా అమిత్ రెడ్డి గారు ముఖ్య అధికారులతో సమావేశమై మెగా డెయిరీకి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు.ఈ సమావేశంలో NDDB ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ రఘుపతి గారు, మదర్ డెయిరీ ఇండియా ఎండీ శ్రీ జై తీర్థచారి గారు, తెలంగాణ విజయ డెయిరీ సంస్థ ఎండీ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి IAS గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మెగా డెయిరీ ప్రస్తుత కార్యకలాపాలు, ఉత్పత్తి సామర్థ్యం, పాల సేకరణ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ విభాగాల అభివృద్ధి తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు. అలాగే సంస్థను మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై కూడా సవివరంగా సమీక్షించారు.రాష్ట్ర డెయిరీ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి, పాల ఉత్పత్తిదారులు మరియు వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా చర్చించారు.📍 రావిరాల, హైదరాబాద్📰 AYUSH24 NEWS – ప్రజల గొంతుక, నిజమైన వార్తలకు విశ్వసనీయ వేదిక#AYUSH24News #VijayaTelanganaDairy #GuthaAmitReddy #MegaDairy #NDDB #MotherDairy #TelanganaDairy #Hyderabad #DairyDevelopment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *