చేరిపల్లి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం
TGUS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కారం
దేవరకొండ, జూలై 31 (AYUSH24 NEWS):
దేవరకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చేరిపల్లి శ్రీనివాస్ పదవీ విరమణ సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా TGUS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీ చేరిపల్లి శ్రీనివాస్ గారిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో ఆయన అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, విద్యారంగానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎస్ గోప్యా నాయక్, చీన్యా నాయక్, ఎంఈవో మాతృ నాయక్, TGUS జిల్లా ప్రధాన కార్యదర్శి పంతులాల్, సైదా నాయక్తో పాటు పలువురు ఉపాధ్యాయులు, విద్యా శాఖ అధికారులు, సంఘ నాయకులు పాల్గొని పదవీ విరమణ పొందిన శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
వక్తలు మాట్లాడుతూ, శ్రీనివాస్ గారు విద్యార్థుల అభ్యున్నతికి, పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా తన అనుభవంతో సమాజానికి, విద్యారంగానికి సేవలు అందించాలని ఆకాంక్షించారు.
— AYUSH24 NEWS

