స్వర్గీయ సువర్ణ వనమాల గారి దశదిన కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు
దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి నివాళులర్పించిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్
మంథని, పెద్దపల్లి జిల్లా, జూలై 31 (AYUSH24 NEWS ప్రతినిధి):
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి సహోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య గారి సతీమణి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గార్ల మేనత్త స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి దశదిన కర్మ కార్యక్రమం శుక్రవారం మంథని పట్టణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు గారు స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో దుద్దిళ్ల శ్రీనుబాబుతో కలిసి మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు ఎల్లే రామ్మూర్తి, కామన్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎస్.ఎస్. అన్వర్, మాజీ ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఎరుకల ఓదెలు, రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండె పోషంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాయకులు స్వర్గీయ శ్రీమతి సువర్ణ వనమాల గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె చేసిన సేవలను స్మరించుకుంటూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
— AYUSH24 NEWS

