Breaking News
యువతే కాంగ్రెస్ పార్టీకి, దేశానికి వెన్నుముక: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ఘనంగా 66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు

దామెర, ఆగస్టు 9:యువతే కాంగ్రెస్ పార్టీకి, భారతదేశానికి వెన్నుముక అని, యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.66వ యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం దామెర మండల కేంద్రంలో పరకాల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాదాసి శ్రీధర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి యువతకు శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. 1960 ఆగస్టు 9న ప్రారంభమైన భారత జాతీయ యువజన కాంగ్రెస్, నేడు దేశంలోని కోట్లాది మంది యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు. యువజన కాంగ్రెస్ అంటేనే ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధంగా ఉండే యువత అని కొనియాడారు.రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమ పథకాలను యువత గడపగడపకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. స్వర్గీయ ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు చూపిన మార్గంలో, రాహుల్ గాంధీ ఆలోచనలు, విధానాలకు అనుగుణంగా యువత ముందుకు సాగాలని సూచించారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

— అయుష్24 న్యూస్ | The Voice of Truth

కంబాలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆర్టీసీ బస్సు–బైక్ ఢీ.. బైక్‌పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం

కంబాలపల్లి | అయుష్24 న్యూస్

కంబాలపల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందించినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.ప్రమాదానికి గల కారణాలు, మృతుడి పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.🔴 మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..ఆయుష్24 న్యూస్ | The Voice of Truth

ఆషాఢ బోనాల సందర్భంగా ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పణ

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలి: మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 9, 2026 | అయుష్24 న్యూస్

ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ శాసన మండలి చైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి నూతన పట్టువస్త్రాలను అధికారికంగా సమర్పించారు.ఉప్పుగూడ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీ సభ్యులు, వేద అర్చకులు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఉప్పుగూడ మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. గత సంవత్సరం కూడా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు గుర్తుచేశారు.ఈ ఏడాది కూడా రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు పుష్కలంగా పండాలని, తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.అమ్మవారి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో దేవరకొండ మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అలంపల్లి నర్సింహా, ఉప్పుగూడ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ మధుసూదన్ గౌడ్, ఆలయ కమిటీ సభ్యులు, వేద అర్చకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలకు సుఖసంతోషాలు కలగాలి — అయుష్24 న్యూస్

కొండమల్లేపల్లి గ్రామపంచాయతీలో వార్డు సభ్యులు–సర్పంచ్ మధ్య విభేదాలు

వార్డు సమస్యలు అడిగితే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు” – ముగ్గురు వార్డు సభ్యుల ఆరోపణలు

కొండమల్లేపల్లి, ఆగస్టు 9 – అయుష్24 న్యూస్:నల్లగొండ జిల్లాలోని మేజర్ గ్రామపంచాయతీ కొండమల్లేపల్లిలో సర్పంచ్, కొంతమంది వార్డు సభ్యుల మధ్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. గ్రామ అభివృద్ధి, వార్డు సమస్యలు, పంచాయతీ నిధుల వినియోగం తదితర అంశాలపై సర్పంచ్‌ను ప్రశ్నిస్తున్న తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఒకటి, రెండు, తొమ్మిదో వార్డు సభ్యులు ఆరోపించారు.ప్రజలు తమపై నమ్మకంతో ఓట్లు వేసి వార్డు సభ్యులుగా ఎన్నుకున్నారని, అదే ప్రజలు గ్రామ సర్పంచ్‌ను కూడా ఎన్నుకున్నారని వారు గుర్తుచేశారు. అందువల్ల రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా అన్ని వార్డులను సమానంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందన్నారు.“వార్డు సమస్యలు చెబితే సిబ్బందికి ఆదేశాలు”శనివారం కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఒకటి, రెండు, తొమ్మిదో వార్డు సభ్యులు బూడిద మంజుల మల్లేష్ యాదవ్, ఎలిమినేటి సాయి, బొడిగ శంకర్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ తమ సమస్యలను వివరించారు.వార్డుల్లో పారిశుద్ధ్యం, బ్లీచింగ్, ఫాగింగ్, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ, మంచినీటి సమస్యలు తదితర అంశాలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.తాము కేవలం ప్రజా సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్తున్నామని, ప్రశ్నించడం ప్రజాస్వామ్యంలో తమ హక్కు అని అన్నారు. అయితే తాము చెప్పిన పనులను సిబ్బంది చేపట్టేందుకు సర్పంచ్ అనుమతి తప్పనిసరి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.“మేమూ ప్రజల ఓట్లతోనే గెలిచాం”తమలో ఒక వార్డు సభ్యుడు మూడుసార్లు, మరొకరు రెండుసార్లు ప్రజల ఆశీర్వాదంతో గెలిచారని వారు తెలిపారు. సంవత్సరాలుగా ప్రజల మధ్య పనిచేస్తున్న వార్డు సభ్యులకు కనీస మర్యాద, గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.సర్పంచ్‌కు ప్రశ్నలు అడిగినందుకు తమను పక్కన పెడుతున్నారని, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. గ్రామపంచాయతీలోని అన్ని వార్డులకు సమానంగా సేవలు అందించాల్సిన బాధ్యత సర్పంచ్‌పై ఉందన్నారు.పంచాయతీ నిధులపై ఆరోపణలుగ్రామపంచాయతీకి గణనీయమైన ఆదాయ వనరులు ఉన్నాయని, నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని వార్డు సభ్యులు డిమాండ్ చేశారు.పంచాయతీ నిధులకు సంబంధించి సుమారు రూ.90 లక్షలు ప్రైవేట్ ఖాతాలోకి మళ్లించారనే ఆరోపణలు తమకు ఉన్నాయని, దీనిపై ఆధారాలు సేకరిస్తున్నామని రెండో వార్డు సభ్యుడు ఎలిమినేటి సాయి తెలిపారు.అయితే ఈ ఆరోపణలకు సంబంధించి సంబంధిత సర్పంచ్ లేదా గ్రామపంచాయతీ అధికారుల అధికారిక వివరణ ఈ సమావేశంలో తమకు అందలేదని వారు పేర్కొన్నారు. ఈ అంశంపై పూర్తి వాస్తవాలు అధికారిక రికార్డులు, సంబంధిత అధికారుల వివరణ ద్వారా తేలాల్సి ఉంది.9వ వార్డు సభ్యుడు బొడిగ శంకర్ గౌడ్ ఆవేదన9వ వార్డు సభ్యుడు బొడిగ శంకర్ గౌడ్ మాట్లాడుతూ తాను ప్రజల ఆశీర్వాదంతో రెండోసారి వార్డు సభ్యుడిగా గెలిచానన్నారు.తన వార్డులో వాటర్ ట్యాంక్ ఏర్పాటు, విద్యుత్ దీపాలు, డ్రైనేజీ శుభ్రత వంటి సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు.గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో వార్డు పనులపై ప్రశ్నించినప్పుడు తనకు సరైన సమాధానం ఇవ్వలేదని, దీంతో తాను తీవ్రంగా ఆవేదనకు గురయ్యానన్నారు.తమపై ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. శనివారం తమ సొంత నిధులతో ఒకటి, రెండు, తొమ్మిదో వార్డుల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.సంత టెండర్‌పై కూడా ప్రశ్నలుకొండమల్లేపల్లి పశువుల సంత టెండర్ విషయంలో కూడా వార్డు సభ్యులు పలు ఆరోపణలు చేశారు.ప్రస్తుతం సంత రీటెండర్‌లో సుమారు రూ.3.80 కోట్లకు పైగా వేలం జరిగినట్లు, భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నట్లు తెలిపారు. టెండర్‌కు సంబంధించిన చెల్లింపులు, వాయిదాల విషయంలో స్పష్టత లేదని వారు ఆరోపించారు.గతంలో సంత కాంట్రాక్టర్‌కు సంబంధించిన చలాన్ల విషయంలో కూడా అవకతవకలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయని, అలాంటి పరిస్థితులు మళ్లీ జరగకుండా పంచాయతీ నిధులు, ఆదాయాల విషయంలో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశారు.“ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు”తమను వ్యక్తిగతంగా టార్గెట్ చేయకుండా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం సర్పంచ్ తమను కలుపుకొని ముందుకు వెళ్లాలని ముగ్గురు వార్డు సభ్యులు కోరారు.సర్పంచ్ కూడా ప్రజల ఓట్లతోనే ఎన్నికయ్యారని, తాము కూడా ప్రజల ఓట్లతోనే వార్డు సభ్యులుగా ఎన్నికయ్యామని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం పాలకవర్గం అంతా కలిసి పనిచేయాలని సూచించారు.“మల్లేపల్లి ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు. భవిష్యత్తులో ప్రజలే అంతిమ తీర్పు ఇస్తారు” అని వార్డు సభ్యులు పేర్కొన్నారు.ఈ ఆరోపణలపై సర్పంచ్ పసునూరి యుగేందర్ రెడ్డి, గ్రామపంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత అధికారులు అధికారికంగా స్పందిస్తే వారి వివరణను కూడా ప్రచురించేందుకు ఆయుష్24 న్యూస్ సిద్ధంగా ఉంది.

– కొండమల్లేపల్లి అయుష్24 న్యూస్

ఆయుష్ 24 న్యూస్‌కు స్పందన

వెంకటేశ్వర్లు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన దాతలు

స్పందించిన దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్

వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయం

దేవరకొండ: అనారోగ్యంతో మంచానికే పరిమితమై తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దువ్వ వెంకటేశ్వర్లు కుటుంబ పరిస్థితిపై ఆయుష్ 24 న్యూస్ వరుస కథనాలను ప్రచురించింది. ఈ కథనాలు వేలాది మందికి చేరడంతో వెంకటేశ్వర్లు కుటుంబం ఎదుర్కొంటున్న దీనస్థితిపై పలువురు స్పందిస్తున్నారు.కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే వెంకటేశ్వర్లు అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితిని ఆయుష్ 24 న్యూస్ అక్షర రూపంలో ప్రజల ముందుకు తీసుకెళ్లింది. దీంతో కొందరు సానుభూతి వ్యక్తం చేయగా, మరికొందరు “మేమున్నాం” అంటూ తమకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.వెంకటేశ్వర్లు కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయంఆయుష్ 24 న్యూస్ కథనాలకు స్పందించిన దేవరకొండ పట్టణానికి చెందిన హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సభ్యులు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించారు.అసోసియేషన్ సభ్యులు కలిసి సమకూర్చిన రూ.10,000 నగదును ఆదివారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబానికి భవిష్యత్తులో మరింత సహాయం అందాలని సభ్యులు ఆకాంక్షించారు.హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు అభినందనీయంఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలుస్తూ, తమకు తోచిన సహాయాన్ని అందిస్తున్న దేవరకొండ హెల్పింగ్ హ్యాండ్స్ అసోసియేషన్ సేవలు ప్రశంసనీయమని పలువురు అభినందించారు. సమాజంలో ఆపదలో ఉన్నవారికి చేయూత అందించడం ద్వారా మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కేశ నరేష్, నరేష్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్ హనుమంతు సాయి చంద్ర గౌడ్, పగిడిమర్రి నాగరాజు, అంజి చారి, బాదం నరేష్, కోర్ర సుమన్, జెల్లా అంజి తదితరులు పాల్గొన్నారు.— Ayush24 News#Ayush24News #Devarakonda #HelpingHandsAssociation #Humanity #FinancialHelp #Venkateshwarlu #DevarakondaNews #Ayush24NewsResponse

నేనావత్ సతీష్ మృతి బాధాకరం – దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

పడమటి తండాలో సతీష్ మృతదేహానికి నివాళులు అర్పించిన రమావత్ రవీంద్ర కుమార్

దేవరకొండ: నేరడుగొమ్ము మండలం పడమటి తండాకు చెందిన BRS వార్డ్ మెంబర్ నేనావత్ మంగ్ల గారి పెద్ద కుమారుడు నేనావత్ సతీష్ మృతి బాధాకరమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.ఆదివారం పడమటి తండాలో సతీష్ మృతదేహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సతీష్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సతీష్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ PACS చైర్మన్ ముక్కమల్ల బాలయ్య, మాజీ వైస్ ఎంపీపీ అరేకంటి రాములు, మాజీ సర్పంచ్ పల్స వెంకటయ్య, గుండాల వెంకట్ యాదవ్, కుంటిగోర్ల నాగరాజు, బైకం సాయి యాదవ్, మంగ్య నాయక్, పూస యాదయ్య, ముఖం మల్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.— Ayush24 News

యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

దేవరకొండ: యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దేవరకొండ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు.అనంతరం దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, ప్రసూతి పొందిన బాలింతలను పరామర్శించారు. వారికి బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.— Ayush24 News#Ayush24News #YouthCongress #YouthCongressFoundationDay #Devarakonda #Congress #KinneraHarikrishna

ఎర్రగడ్డలో ఘనంగా నల్లపోచమ్మ బోనాల ఉత్సవాలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 9: హైదరాబాద్ ఎర్రగడ్డలోని ఎస్. శంకర్ నగర్‌లో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ నల్లపోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో, అలాగే డాన్ బాస్కో స్కూల్ ఆవరణంలో నిర్వహించిన శ్రీ నల్లపోచమ్మ అమ్మవారి బోనాల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పాల్గొన్నారు.స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, పాడిపంటలతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బోనాల పండుగను నిర్వహిస్తున్న ఎర్రగడ్డ ప్రాంత ప్రజలకు గుత్తా అమిత్ రెడ్డి హృదయపూర్వక బోనాల శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.— Ayush24 News#Ayush24News #LashkarBonalu #LashkarBonalu2026 #TelanganaBonalu #GuthaAmitReddy #Bonalu2026 #Erragadda #Nallapochamma

SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ EC సమావేశం

OBC ఉద్యోగుల సమస్యలు, సభ్యత్వం, భవిష్యత్ కార్యక్రమాలపై విస్తృత చర్చ

హైదరాబాద్, ఆగస్టు 9, 2026:SBI OBC ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ హైదరాబాద్ సర్కిల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) సమావేశం ఈరోజు పర్వాన్ హాల్‌లో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు NVT, ప్రధాన కార్యదర్శి K. రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు.సమావేశంలో ఇటీవల నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం విజయవంతం, అసోసియేషన్ కార్యాలయ ప్రారంభోత్సవం, సభ్యత్వ నమోదు, AGS, RS, ARS పరిచయ కార్యక్రమం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు.అలాగే వివిధ AOలలో OBC ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, జనరల్ బాడీ సమావేశం మరియు కార్యాలయ ప్రారంభోత్సవానికి సంబంధించిన ఖర్చులు తదితర అంశాలను చర్చించారు. ప్రతి AO పరిధిలో OBC ఉద్యోగుల సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు.ఈ EC సమావేశాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని AOల DGS, వైస్ ప్రెసిడెంట్లు, AGSలు, RSలు, ARSలు, లేడీ రిప్రజెంటేటివ్‌లకు అసోసియేషన్ నాయకులు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.అదేవిధంగా జనరల్ బాడీ సమావేశం, కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలను విజయవంతం చేసిన ప్రతి OBC సభ్యుడికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ సమావేశానికి హైదరాబాద్ విచ్చేసిన ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ రామ్ సింగ్ యాదవ్, అమరావతి సర్కిల్ ప్రెసిడెంట్ సంతోష్, గుజరాత్ ప్రెసిడెంట్ రాజేష్లకు అసోసియేషన్ నాయకులు ఘన స్వాగతం పలికారు. వారిని శాలువాలతో సత్కరించి అభినందించారు.OBC ఉద్యోగుల హక్కులు, సమస్యల పరిష్కారం, సంఘటిత శక్తి పెంపొందించడం, సభ్యత్వాన్ని మరింత విస్తరించడం వంటి అంశాలపై భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించారు.— AYUSH24 NEWS

మిర్యాలగూడను ఆరోగ్య మిర్యాలగూడగా తీర్చిదిద్దాలి: బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్

ప్రతి ఇంటి నుంచి చిన్నారులు, పెద్దలు కరాటే నేర్చుకోవాలి

100 మంది కరాటే విద్యార్థులకు సొరకాయల పంపిణీ

మిర్యాలగూడ, ఆగస్టు 9, 2026:మిర్యాలగూడ పట్టణంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో సుమన్ షోటోకాన్ కరాటే అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న కరాటే ప్రాక్టీస్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 100 మంది కరాటే విద్యార్థిని, విద్యార్థులకు సొరకాయలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్, జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీహరి నాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ శ్రీనివాస్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణాన్ని “ఆరోగ్య మిర్యాలగూడ”గా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి నుంచి చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కరాటే శిక్షణ తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.జననేత్రి ఫౌండేషన్ అధినేత డాక్టర్ మునీర్ మాట్లాడుతూ మిర్యాలగూడ పట్టణంలోని ప్రతి మహిళ తప్పనిసరిగా కరాటే శిక్షణ తీసుకోవాలని సూచించారు. మహిళలకు ఆత్మరక్షణతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కరాటే ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ శ్రీహరి నాయక్ మాట్లాడుతూ తాను చిన్నతనంలో రామకృష్ణ మాస్టర్ వద్ద కరాటే శిక్షణ పొందానని తెలిపారు. ఆ శిక్షణ తన జీవితంలో ఎంతో ఉపయోగపడిందని, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అందుకున్నానని చెప్పారు. అలాగే ఆగస్టు 16న చెన్నైలో నిర్వహించనున్న గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కార్యక్రమంలో తాను పాల్గొంటున్నట్లు వెల్లడించారు.సీనియర్ కరాటే మాస్టర్ బండవత్ రామకృష్ణ నాయక్ మాట్లాడుతూ గత మూడు దశాబ్దాలుగా మిర్యాలగూడ పట్టణంలో ఎంతోమంది పేద విద్యార్థులకు కరాటే శిక్షణa అందిస్తున్నట్లు తెలిపారు. తమ వద్ద శిక్షణ పొందిన అనేక మంది విద్యార్థులు జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారని చెప్పారు. కొందరు గిన్నిస్ వరల్డ్ రికార్డులు కూడా సాధించిన విషయాన్ని గుర్తుచేశారు.చదువు ఎంత ముఖ్యమో కరాటే కూడా అంతే అవసరమని రామకృష్ణ నాయక్ అన్నారు. మిర్యాలగూడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు ప్రతి ఇంటి నుంచి కనీసం ఒక చిన్నారినైనా కరాటే శిక్షణలో చేర్పించాలని కోరారు. “మిర్యాలగూడను ఆరోగ్య మిర్యాలగూడగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో శివ భారతి, అజయ్, కార్తికేయ, ప్రవళిక, ఉష్ణ తదితరులు పాల్గొన్నారు.— AYUSH24 NEWS